పోస్ట్‌లు

మే, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

'విశ్వ'నాథుడే (Special page)

చిత్రం
చా న్నాళ్ల కిందటి మాట. ఆనంద్‌ వందల కొద్దీ చెస్‌ పుస్తకాల్ని చదివేశాడనీ, లక్షల కొద్దీ గేమ్‌లను విశ్లేషించి, రాటుదేలాడని తెలుసుకున్న ఓ విలేకరి అతనికి పరీక్ష పెట్టాలనుకున్నాడు. కొన్ని చెస్‌ గేమ్‌లకు సంబంధించిన చిత్రాల్ని తీసుకుని.. ఓ విందులో ఆనంద్‌ను కలిశాడు. ఓ ఫొటో తీసి ఆనంద్‌ ముందు పెట్టాడు. రెండు సెకన్లు గడిచాయి. ''అది 1982లో లాస్కర్‌ చేసిన పరిశోధన కదూ'' ..ఆనంద్‌ నుంచి సమాధానం. ఇంకో చిత్రం చూపించాడు.. రెండు సెకన్ల మౌనం.. ''1962లో ఫిషర్‌-నాజ్‌డార్ఫ్‌ గేమ్‌ అది..'' అంటూ గేమ్‌ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు ఆనంద్‌. విలేకరి ఇంకో చిత్రం చూపించాడు. ఈసారి వెంటనే సమాధానం.. ''1994లో నేను కామ్‌స్కీతో ఆడిన గేమ్‌'' అని. ఆనంద్‌ జ్ఞాపకశక్తి గురించి చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచినపుడో.. లేదా మరేదైనా టోర్నీలో నెగ్గినపుడో మాత్రం మనం ఆనంద్‌ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుంటాం.. గేమ్‌లో భలేగా ఎత్తులు వేశాడంటూ మాట్లాడుకుంటాం! కానీ ఓ గేమ్‌కు ముందు, ఓ టోర్నీకి ముందు ఆనంద్‌ ఎంత శ్రమిస్తాడో.. ఎంతగా బుర్రకు పనిపెడతాడో తెలుసుకుంట

ఆనందమానందమాయె (Chess Champion Vishwanath Anand)

చిత్రం
ఆనందమానందమాయె విషీ ఖాతాలో ఐదో ప్రపంచ చెస్‌ టైటిల్‌ టైబ్రేక్‌లో 2.5-1.5తో గెల్ఫాండ్‌పై గెలుపు విశ్వనాథుడికే మళీ పట్టం. 64 గళ్ల అతడి రాజ్యం సురక్షితం. చెస్‌ ప్రపంచానికి అతడే కింగ్‌. అతడి పట్టుదల అమోఘం! అతడి ఏకాగ్రత అద్వితీయం. అందుకే మాస్కో యుద్ధంలో గెలిచాడు. గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఐదోసారి.. వరుసగా నాలుగోసారి ప్రపంచ చెస్‌ ఛాంపియనయ్యాడు. 42 ఏళ్ల విషీ.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టై బ్రేకర్‌లో బుధవారం బోరిస్‌ గెల్ఫాండ్‌కు చెక్‌ చెప్పాడు. వచ్చే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ వరకు, అంటే 2014 వరకు కిరీటం ఆనంద్‌దే. మాస్కో :  విషీ మళ్లీ ఖుషీ. అద్భుత పోరాటంతో ఆనంద్‌ మరోసారి ప్రపంచ చెస్‌ విజేతగా అవతరించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ర్యాపిడ్‌ చెస్‌ టైబ్రేకర్‌లో ఆనంద్‌.. 2.5-1.5తో ఛాలెంజర్‌ గెల్ఫాండ్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి గట్టిపోటీ ఇచ్చిన గెల్ఫాండ్‌కు స్పీడ్‌ చెస్‌లో తలవంచక తప్పలేదు. నాలుగు ర్యాపిడ్‌ గేమ్‌లలో.. రెండో గేమ్‌ను గెలిచిన ఆనంద్‌. మిగతా మూడింటిని డ్రాగా ముగించాడు. 12 క్లాసికల్‌ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 6-6తో నిలవడంతో టైబ్రేకర్‌ అనివార్యమైన సంగతి తెలిసిందే.

ట్యాబ్లెట్‌ కొన్నారా? (Eenadu Thursday Internet tips 31/05/2012)

చిత్రం
ట్యాబ్లెట్‌... ట్యాబ్లెట్‌.. ట్యాబ్లెట్‌!ఎక్కడైనా ఇదే మాట! సొంతం చేసుకున్నారు సరే.. మరి అబ్బురపరిచే అప్లికేషన్లు తెలుసా?పైగా ఇవన్నీ ఉచితం! నా జూకుగా చేతిలో ఒదిగిపోయే ట్యాబ్లెట్‌ చౌకగానూ అందుబాటులోకి వస్తోంది. కంపెనీలు నువ్వా, నేనా అంటూ రోజుకో మోడల్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ గురించి వేరే చెప్పాలా? అదనపు అప్లికేషన్లతో అన్నీ ప్రయోజనాలే. ఈ నేపథ్యంలో ఉచితంగా అందుబాటులో ఉన్న అప్లికేషన్లు కొన్ని... ఇదో ఫైల్‌ మేనేజర్‌ ట్యాబ్లెట్‌లో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయడానికి డీఫాల్ట్‌గా ఎక్స్‌ప్లోరర్‌ ఉంటుంది. మరింత సులభంగా ఫైల్స్‌, ఫోల్డర్లను బ్రౌజ్‌ చేసి చూసుకోవాలంటే  File Manager  ఉంటే సరి. 80 రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. 19 భాషల్లో సెట్‌ చేసుకుని వాడుకోవచ్చు. ఫైల్స్‌ని  List, Grid View ల్లో చూడొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవచ్చు. వెతుక్కుని పంచుకోవచ్చు కూడా. ముఖ్యమైన వాటికి తెరపై షార్ట్‌కట్స్‌ పెట్టుకోవచ్చు. టెక్ట్స్‌ ఎడిటర్‌, ఇమేజ్‌ గ్యాలరీ... సదుపాయాలు ఉన్నాయి.  http://goo.gl/it0Jh *  ఇలాంటిదే మరోటి  Open Manger .  ఫైల్స్‌ని కంప్రెస్‌, ఎక్ప్‌ట్సాక్ట్‌ చేయవచ్చు.  So

అక్కడ మంచినీళ్లు దొరకవు!

చిత్రం
అక్కడ మంచినీళ్లు దొరకవు! 'చారిత్రక పిరమిడ్లూ... మోజెస్‌, క్రీస్తు నడయాడిన పవిత్రస్థలాలూ... ఎడారి పంటలూ... ఇలా మరెన్నో విశేషాల సమాహారమే మా త్రిదేశయాత్ర' అంటున్నారు ఆయా దేశాల్ని చుట్టివచ్చిన హైదరాబాద్‌ వాసి  గీతాంజలికుమార్‌. నే నూ మావారూ మా చెల్లీ మరికొందరు మిత్రులం మొత్తం 24 మందిమి కలిసి హోలీలాండ్‌ ట్రిప్‌గా పిలిచే ఈ త్రిదేశయాత్రకు బయలుదేరాం. ఎయిర్‌ అరేబియాలో దాదాపు ఏడెనిమిది గంటలు ప్రయాణించి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి చేరుకున్నాం. అక్కడకు వెళ్లేసరికి ఎయిర్‌పోర్టు బయట మాకోసం గైడ్‌ ఏసీ లగ్జరీబస్‌లో ఎదురుచూస్తూ ఉన్నాడు. అలెగ్జాండ్రియా నగరం చాలా పెద్దది. తనకోసం ఈ నగరాన్ని నిర్మించమన్న అలెగ్జాండర్‌ ఇది చూడకుండానే మరణించాడట. అక్కడ ఈతపండ్లూ, ఆలివ్‌లూ, టొమాటోలూ ట్రక్కుల్లో రవాణా చేస్తున్నారు. అక్కడ నుంచి బస్సులో ముందుగా కైరో నగరానికి చేరుకున్నాం. దార్లో ఓ హోటల్లో కాఫీ తాగి ఇరవై డాలర్ల నోటిస్తే అతను కొన్ని ఈజిప్షియన్‌ పౌండ్లు, చిల్లర నోట్లు ఇచ్చాడు. అదెంతో తెలియక చాలాసేపు ఇబ్బందిపడ్డాం. దాదాపు ఐదుగంటల ప్రయాణం చేశాక కైరో చేరుకున్నాం. గిజా, కైరో కలిసే ఉన్నాయి. నగరవీధులన్నీ శ

పొగ పెట్టేస్తోంది

చిత్రం
పొగ పెట్టేస్తోంది కొ న్ని కోట్ల మంది ప్రజలను వూపిరితిత్తులు, గొంతు క్యాన్సర్‌లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తోంది. ఏటా ఎన్నో లక్షల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఆ విష వృక్షమే పొగాకు. అలాంటి దానికి దూరంగా ఉండాల్సింది పోయి, కోరి కోరి నోట్లో పెట్టుకుంటున్నవారు ఇప్పటికైనా ఆలోచిస్తారా..? మే 31 - ప్రపంచ పొగాకు వ్యతిరేకదినం పొ గాకులో 4000 రకాల రసాయన పదార్థాలుంటాయి. అందులో కనీసం నాలుగొందల రకాలు ఆరోగ్యానికి తీవ్రంగా హాని చేసేవే.  *  రోజూ తినే ఆహారంలో అయిదొంతులు పండ్లూ కూరగాయలు తింటూ వ్యాయామం చేసేవారైనా సరే పొగతాగే అలవాటుంటే వారి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లేనట.  *  పొగాకులో ఉండే కార్సినోజెన్‌- క్యాన్సర్లు రావడానికి కారణం అయితే, నికోటిన్‌ శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతుంది. నికోటిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల మిశ్రమం ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి, రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల హృదయం, మెదడుల్లో రక్తం గడ్డ కట్టి అకస్మాత్తుగా మరణాలు సంభవించే అవకాశం ఉంది. కొందరికి అవయవాలు పనిచేయకుండా పోయే పరిస్థితీ వస్తుంది.  *  తొంభైశాతం వూపిరితిత్తుల క్యాన్సర్‌ రోగులు, హార్ట్‌ఎటాక్‌ వచ్చేవారి

నారాయణుడు వరుడైన క్షేత్రం

చిత్రం
నారాయణుడు వరుడైన క్షేత్రం పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగిన ఆ ప్రాంతం... ఓ దేవాలయమైంది. ఆ జంట వివాహ వేడుకకు సంబంధించిన వస్తువులే అందులోని ప్రధాన ఆకర్షణ. పద్మావతిని పరిణయమాడటానికి నారాయణుడు వరుడిగా వచ్చిన ఆ పవిత్రక్షేత్రమే తిరుపతికి సమీపంలోని నారాయణవరం. కు డిచేతికి కల్యాణ కంకణం... నడుముకు దశావతార వడ్డాణంతో అలరారే ఆ వేంకటేశ్వరుణ్ణి చూస్తే కల్యాణశోభ ఉట్టిపడుతుంది. పరిణయమాడింది పద్మావతినే అయినా ఆ స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి మాత్రమే కనిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడు 'కల్యాణ వేంకటేశ్వరుడు'గా వెలసిన ఆ క్షేత్రమే నారాయణవరం. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా పద్మావతీ శ్రీనివాసుల పరిణయ ఘట్టం గురించి తెలుసుకోవాలి. పెళ్లికి 14.14 కోట్ల అప్పు తిరుమలకు ఆగ్నేయంగా ఉన్న నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని ఆకాశరాజు పాలించేవాడట. సంతానం లేని ఆకాశరాజు... పండితుల సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం మొదలుపెట్టాడు. అందులో భాగంగా పొలాన్ని బంగారు నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డు తగిలింది. దాన్ని తెరిచిచూస్తే అందులో ఒక శిశువు ఉందట. ఆ పాపకు పద్మావతి అని పేరుపె

ఎంతో రుచిరా..! (Eenadu Sunday 27/05/2012)

చిత్రం
ఎంతో రుచిరా..! పాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదో సముద్రం... క్షీర సముద్రం! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మనం, వినియోగంలో మాత్రం వెనుకబడే ఉన్నాం. 'ప్రపంచ పాల దినోత్సవం' (జూన్‌ 1)నుంచి అయినా 'రోజుకో లోటా..' తీర్మానాన్ని అమలుచేద్దాం. అ ప్పటిదాకా... వద్దేవద్దని మారాం చేసినవాడు, తిననే తిననని మొండికేసినవాడు, అస్సలు ఆకల్లేదని హఠం చేసినవాడు... వెండిగిన్నెను చూడగానే మనసు మార్చుకుంటాడు. అమాంతంగా అమ్మ ఒళ్లో వాలిపోతాడు. ముద్దుగా నోరు తెరుస్తాడు. బుద్ధిగా ముద్దలు పెట్టించుకుంటాడు. కారణం... పాలబువ్వంటే ఇష్టం. పాలంటే ఇంకా ఇష్టం. గిన్నె ఖాళీ అయిపోయాక, 'వాతాపి జీర్ణం... వాతాపి జీర్ణం' అంటూ అమ్మ బుజ్జిగాడి బొజ్జమీద ప్రేమగా నిమురుతుంది. 'ఇంతకీ, ఎవరీ వాతాపి' అంటారా? అదో పెద్ద కథ. పురాణాల ప్రకారం అతనో రాక్షసుడు. మనుషుల పొట్టల్లో దాక్కుని వేధిస్తుంటాడు. చెడుకు ప్రతినిధి. పరోక్షంగా అజీర్ణానికీ అనారోగ్యానికీ అధినాయకుడు. ఆ రాక్షసుడితో ఫైటింగ్‌ చేసే ప్రధాన హీరో...పాలే! పాలలో అపారమైన విలువలున్నాయి. చెడు క్రిముల్ని ఓడించడంలో, మంచి పోషకాలను రక్షించడ

సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం! (Eenadu etaram 26/05/2012)

చిత్రం
సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం! సమయం దొరికితే సరదాల ఒడిలోకి జారుకోవడం... కాలేజీ కుర్రకారుకు సాధారణం... దీనికి భిన్నంగా... సమాజానికి ఉపయోగపడుతోందో విద్యార్థి బృందం... ఉద్యోగం రాగానే సొంతానికి ఆలోచించడం సహజం... అందుకు భిన్నంగా సమాజ హితానికి ప్రయోగాలు చేశాడో యువకుడు... వీరి సదాశయం, సమాజ కాంక్ష వూరికే పోలేదు. అంతర్జాతీయ అవార్డులందాయి! ఆ విజయగాథని 'ఈతరం'తో పంచుకున్నారిలా... పచ్చదనానికి వూతం! అంతర్జాతీయ పోటీ. బరిలో యాభై ఒక్క దేశాలు. మూడు వందల విశ్వవిద్యాలయాలు. నెలలో ఎవరు ఎక్కువ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడితే వాళ్లే విజేతలు. కలసికట్టుగా అడుగేశారు  పెరంబదూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు. విజయలక్ష్మి వరించింది. అంతర్జాతీయ అవార్డు అందింది. 'ఎ ర్త్‌ డే నెట్‌వర్క్‌' అమెరికా సంస్థ. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం. ధరిత్రి దినోత్సవం సందర్భంగా కాలేజీ విద్యార్థులకు 'మొబిలైజ్‌ యు' పేరిట పోటీ నిర్వహించింది. ఈ విషయం శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి రమేష్‌ రాజేష్‌కి తెలిసింది. వెంటనే కళాశాలలోని ఎకో ఫోరం, కేర్‌ క్లబ్‌, సహచర విద్