పోస్ట్‌లు

జనవరి, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలివిగా వాడేందుకు తీరైన దారులు! (Eenadu Thursday_24/01/13)

చిత్రం
పీసీ.. ల్యాపీ... నెట్‌బుక్‌... ఏదో ఒకటి ఉండే ఉంటుంది... మరి, ఏదో వాడేస్తున్నాం అంటే సరి కాదు... కొత్త ఏడాదైనా కాస్త తెలివిగా వాడండి! అందుకు మార్గాలు అనేకం! ఒ కే పంథాలో వాడుతూ వెళితే కొత్త కంప్యూటర్‌ కూడా కుమ్మరి పురుగులానే పని చేస్తుంది. కొత్త ఏడాది అంతా కొత్త కొత్తగా ఉండాలనుకునే దాని విషయంలోనూ పాటించండి. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సరికొత్త చిట్కాలు తెలుసుకోవాలి. పనిని సులభం చేసుకోవాలి. కొత్త టూల్స్‌ వాడాలి. అనేక ప్రయోజనాల్ని పొందాలి. అందుకు పైసా ఖర్చు అక్కర్లేదు. ఉచితంగానే అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా చూద్దాం! పవర్‌ అందించండి! సిస్టంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే టెక్నీషియన్‌ని సంప్రదించకుండా అప్లికేషన్‌ రూపంలోనే పీసీని పర్యవేక్షించే సేవకుడిని పెట్టుకోవచ్చు. అదే  PowerSuite LITE 2013.   ఉచిత వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని సిస్టం మొత్తాన్ని స్కాన్‌ చేసి లోపాల్ని తెలుసుకోవచ్చు. అందుకు  Speed Tools, System Optimization, Disk Optimization   విభాగాలున్నాయి. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని సౌకర్యాల్ని వాడుకోవచ్చు.  http://goo.gl/yzkN5 *  ఇలాంటిదే మరోటి  SpeedUpMyPc.

తీపి.. తీపి సంబరాలు

చిత్రం
తీపి.. తీపి సంబరాలు ముంగిట్లో మెరిసే రతనాల రంగవల్లికల నుంచి.. తెల్లవారుజామున వేసే భోగిమంటలు.. తలంటుస్నానాలు.. గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు కొట్టే కేరింతల దాకా.. సంక్రాంతి అంటే ఒకటే హడావుడి. ఈ సమయంలో సంప్రదాయ పిండివంటలతోపాటు.. విభిన్న పదార్థాలు లేకపోతే.. పండక్కి నిండుదనమే లేదు. కాదంటారా.. ఆలస్యమెందుకు అలాంటి రుచుల్ని మీరూ ప్రయత్నించండి మరి. గసగసాల హల్వా కావల్సినవి:  గసగసాలు, పంచదార - గ్లాసుచొప్పున, నెయ్యి - అరగ్లాసు, యాలకులపొడి - అరచెంచా.  తయారీ : గసగసాల్ని మూడునాలుగు గంటలముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత సన్నని రవ్వమాదిరి రుబ్బి.. పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద ఉంచి.. మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. హల్వా కొద్దిగా ఉడికాక నెయ్యి, యాలకులపొడి చేర్చాలి. ముదరు వర్ణంలోకి వచ్చాక పొయ్యికట్టేయాలి. తడి తగలకపోతే.. ఈ హల్వా వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది.  - సోమ మనోరమ, హైదరాబాద్‌ ఉటంకులు కావల్సినవి:  బియ్యం - గ్లాసు, పంచదార - ముప్పావుగ్లాసు, పాలు - పావులీటరు, నూనె -వేయించడానికి సరిపడా. తయారీ:  బియ్యాన్ని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరవాత నీటిని వంపేసి.. మరోసారి వడకట్టాలి. ఇప్పుడు

విడివిడిగా కలివిడిగా..సామాజిక ఒరవడిగా! (Eetaram_12/01/13)

చిత్రం
వూసుపోని కబుర్లు... ఉకదంపుడు ముచ్చట్లు... సరదాల కాలక్షేపం... సల్లాపాల వ్యవహారం... ఫేస్‌బుక్‌ అనగానే చాలామంది భావమిదే! కానీ కొంతమంది దృష్టిలో... అదో అనుబంధాల వారధి... సమాజ సేవకు మార్గం... అభిరుచుల సమాహారం... దాని కోసం వాళ్లు ఫేస్‌బుక్‌ 'గ్రూపు'లుగా జ తకడుతున్నారు! ఆన్‌లైన్‌ మాటల్ని ఆఫ్‌లైన్‌లో చేతలుగా మార్చేస్తున్నారు! ఆ సంగతుల ఖజానా ఈవారం. నలుగురు యూత్‌ కలిస్తే కబుర్ల వరదే. ఆన్‌లైన్లో సామాజిక అనుబంధాల వారధైన 'ఫేస్‌బుక్‌'లో లక్షలాది మధ్య జరిగేది కూడా ఇదే. 'ప్రతి ఫ్రెండూ అవసరమేరా...' తరహాలో ఒకరి పరిచయాలు మరొకరితో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'లై, 'కన్‌ఫం' స్నేహితుల కలబోతల కబుర్లతోనే ఆగిపోవడం లేదు యువత. వేర్వేరు అభిరుచుల మేరకు వేర్వేరు బృందాలుగా ఏర్పడుతూ కలిసి కట్టుగా సాగుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెండే జోరు మీదుంది. ఇక లక్షల గ్రూపులు పుట్టకుండా ఉంటాయా? 'బృందా'వనమిది... "those who love a girl truely... - - - - - -  one day he loves me too... అంటుందట వైన్‌షాపు బోర్డు. ప్రేమికుడిని ఉద్దేశించి ఓ టీనేజీ కుర్రాడు కొంటెగా చేసిన వ్యాఖ్య ఇది. 

అరచేతిలోనే వార్తా ప్రపంచం! (Eenadu_17/01/13)

చిత్రం
అత్యాచారాలు... యాసిడ్‌ దాడులు... మోసాలు... చెప్పాలంటే లెక్కకు మిక్కిలి నేరాలు! రోజూ పత్రికలు ఎలుగెత్తి చాటుతూనే ఉన్నాయి... నిత్యం వార్తాంశాల్ని అప్‌డేట్‌ చేస్తున్నాయి... అందుకు స్మార్ట్‌ మొబైళ్లూ వేదికలవుతున్నాయి! మునివేళ్లపైనే వార్తా విశ్లేషణల్ని అందిస్తున్నాయి! ఆయా వారధుల విశేషాలిగో..! దే శం మొత్తాన్ని కంటతడి పెట్టించడమే కాక... కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ప్రదర్శించేలా చేసిన ఢిల్లీ యువతి అత్యాచార సంఘటన ఇంకా మర్చిపోనేలేదెవ్వరూ. ఈ మానవీయ కథనం వెనక వాస్తవాల్ని వార్తా పత్రికలు, ఛానళ్లు నిత్యం ప్రచురితం, ప్రసారం చేయడం సహజమే. కానీ ఇవి వివిధ వారధులపై క్షణాల్లో ప్రజానికాన్ని చేరేలా చేస్తున్న సాధనాలు ఉన్నాయి. పేపర్‌ తెరవకుండానే, టీవీలు చూడక్కర్లేకుండానే వార్తలు నేరుగా మొబైళ్లలోకి చేరి జేబులోకే ప్రసారం అయిపోతున్నాయి. ఆయా స్టోర్‌ల్లో అందుబాటులో ఉన్న ఆప్స్‌తో వార్తలు ఎప్పటికప్పుడు అరచేతిలోనే అప్‌డేట్‌ అయిపోతున్నాయి. మరి ఆ మార్గాలేంటో తెలుసుకుందామా? 'హంట్‌' చేయొచ్చు! తెలుగు, ఇంగ్లిష్‌, హింది, మలయాళం... దేశంలోని వివిధ భాషల దిన పత్రికల్ని బ్రౌజ్‌ చేసి చదవాలంటే  News Hunt ఆప్‌ని డ

అలరించేందుకు అన్నీసిద్దం! (Eenadu_10/01/13)

చిత్రం
ఏడాది ప్రారంభం... కొత్తదనానికి అదో పెద్ద వేదిక... ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ ప్రియుల చూపంతా అక్కడే! అదే 'సీఈఎస్‌ 2013' ఈ ఏడాది పరిచయం కానున్న సరికొత్త పరికరాలేంటో చూద్దాం! లె డ్‌ టీవీలు... స్మార్ట్‌ కెమెరాలు.. స్మార్ట్‌ మొబైళ్లు... ఇంటిలిజెంట్‌ ట్యాబ్‌లు... ఇలా సరికొత్త మోడళ్లు అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న సీఈఎస్‌  (Consumer Eletronics Show) 2013 లో దర్శనమిస్తున్నాయి. ఔరా! అనిపించే సౌకర్యాల్ని పరిచయం చేస్తున్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ముంచెత్తబోయే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు అవి మోసుకొచ్చే సౌకర్యాలేంటో చూద్దాం! 55 అంగుళాలు ఎల్‌జీ కంపెనీ  OLED TV  ని పరిచయం చేసింది. తెర పరిమాణం 55 అంగుళాలు. 4 మిల్లీమీటర్ల (0.16 అంగుళాలు) మందంతో నాజూకుగా కనిపిస్తుంది. బరువు 10 కేజీలు. ధర సుమారు రూ.11,999 డాలర్లు. 65 అంగుళాల తెరతో మరో మోడల్‌ని పరిచయం చేసింది. దీనికి ఇంకా ధర నిర్ణయించలేదు. వీడియో, ఇతర వివరాలకు  http://goo.gl/iovhQ, http://goo.gl/bwilh ఇద్దరూ ఒకేసారి! శ్యామ్‌సంగ్‌ మరో 'సూపర్‌ ఓలెడ్‌ టీవీ'ని ప్రదర్శించింది. పేరు  F8000 . ఐఫోన్‌ పరిచయం చేసిన '

అందానికి ద్రాక్ష

చిత్రం
తియ్యని పుల్లని ద్రాక్ష పండ్లు తినడానికే కాదు, సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ద్రాక్షలు చర్మానికి మెరుపు తీసుకొస్తాయి. వయసు చాయలు కనిపించకుండా చేస్తాయి. *  కొన్ని ద్రాక్ష పళ్లని చేతులతో ముద్దగా చేసుకుని, దానికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ పట్టించి కాసేపయ్యాక కడిగేసుకుంటే జిడ్డు దూరమై, చర్మం కాంతిమంతం అవుతుంది.  *  చర్మం పొడిబారే సమస్యతో బాధపడే వారు గుడ్డులోని తెల్లసొనకు, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి రాసుకుని పది నిమిషాల తరవాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. కళ్ల చుట్టూ ముడతలు వస్తున్నప్పుడూ ద్రాక్ష పండ్లతో వాటిని దూరం చేసుకోవచ్చు. ద్రాక్షను రెండు ముక్కలుగా చేసుకుని కంటి చుట్టూ కొన్ని క్షణాలు రాయాలి. ఇలా తరచూ చేస్తే ముడతలు తగ్గిపోతాయి. *  అయిదు స్పూనుల పెరుగుకి, మూడు స్పూనుల ద్రాక్షరసం, ఒక స్పూను నారింజ రసం కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు. ఇది వయసు పైబడిన ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ద్రాక్షలకు మొటిమలూ, వాటి వల్ల వచ్చే మచ్చల్నీ తగ్గించే గుణం ఉంది. నాలుగైదు ద్రాక్ష పళ్లని మెత్తగా చ

క్రిస్మస్‌ వేళ రుచుల మేళా

చిత్రం
శాంతాక్లాజ్‌ అందించే కానుకలూ, నక్షత్రాల వెలుగులూ,  జింగిల్‌ బెల్స్‌ సందడీ, ఆత్మీయులతో కలిసి పండగ జరుపుకోవడం... క్రిస్మస్‌ వస్తోందంటే సందడే సందడి. ఈ ఆనందాల సమయంలో నోరు తీపి చేసుకునేందుకు కచ్చితంగా కేక్‌లూ, బిస్కెట్లూ, పిండివంటలూ ఉండాల్సిందే. పిల్లలే కాదు, ఇంటిల్లిపాదీ రుచిరుచిగా తినేందుకు అనువైన అటువంటి పదార్థాల పరిచయమే ఇది. రుచిరుచిగా కొబ్బరి బిస్కెట్లు కావల్సినవి:  కొబ్బరితురుము - రెండు కప్పులు, చక్కెరపొడి - రెండు కప్పులు, పాలు - కప్పు, వెన్న - నాలుగుటేబుల్‌స్పూన్లు, జీడిపప్పుపొడి - టేబుల్‌స్పూను, గులాబీ ఎసెన్సు - అరచెంచా. తయారీ:  బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల వెన్న, కొబ్బరితురుము, చక్కెరపొడి, పాలు, జీడిపప్పు పొడి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర కరిగి మిశ్రమం దగ్గరపడేవరకూ ఉంచాలి. ఆ తరవాత మిగిలిన వెన్న, గులాబీ ఎసెన్సు వేసి మరోసారి కలపాలి. రెండుమూడు నిమిషాలయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక బిస్కెట్ల్లలా కోసుకుంటే సరిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి బిస్కెట్లు సిద్ధం.  పసందైన కోవా, స్ట్రాబెర్రీ కేక్‌ కావల్సి