పోస్ట్‌లు

ఆగస్టు, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

కేరళ వరద ఒక కనువిప్పు (GK sharing article)

చిత్రం
మానవ తప్పిదమే..! పడమటి కనుమలకు చేటు ఫలితమే కేరళ విపత్తు!! మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ  సిఫార్సుల్ని అటకెక్కించారు పర్యాటకుల స్వర్గధామం కేరళ నేడు కనీవినీ ఎరుగని ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తోంది. కుండపోత వర్షాలతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మనిషి సృష్టించిన విపత్తేననేది పర్యావరణ నిపుణుడు మాధవ్‌ గాడ్గిల్‌ నిశ్చితాభిప్రాయం. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి కలిగిస్తున్న హాని నేడు ప్రకృతి వైపరీత్యం రూపంలో కేరళపై విరుచుకుపడుతోందని కుండబద్ధలు కొట్టారు. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ(డబ్ల్యూజీఈఈపీ) 2011 ఆగస్టు 31న ప్రభుత్వానికి 522 పేజీల నివేదికను సమర్పించింది. ప్రస్తుతం వర్షాల్లో నష్టపోయిన కేరళలోని పలు ప్రాంతాలు పర్యావరణపరంగా సున్నితమైన మండలాలు(ఈఎస్‌జెడ్‌) అంటూ కమిటీ ఆనాడే వర్గీకరించింది. మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, అమలుకు సిఫార్సులు చేయడం కోసం ఆ తర్వాత ఏర్పాటుచేసిన కస్తూరీరంగన్‌ కమిటీ కూడా పశ్చిమ కనుమల పరిరక్షణకు పలు సిఫార్సులు చే

అగ్రరాజ్యాలను ఢీకొట్టి.. అణు పరీక్షలు నిర్వహించి.. (Atal Bihari Vajpayee Special)

చిత్రం
అగ్రరాజ్యాలను ఢీకొట్టి.. అణు పరీక్షలు నిర్వహించి.. పోఖ్రాన్‌-2 నిర్వహణలో గుండెధైర్యంతో నిలిచిన వాజ్‌పేయీ హైదరాబాద్‌: దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందప్పుడు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, చైనా వరుసగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. చైనా అండతో దాయాదిదేశం పాకిస్థాన్‌ సైతం అణ్వాయుధాలను తయారు చేసుకోవడంలో మన కన్నా ఒక అడుగు ముందే ఉంది. 1974లో ‘స్మైలింగ్‌ బుద్ధ’ పేరుతో భారత్‌ తొలి అణు పరీక్ష జరిపి అప్పటికే చాన్నాళ్లైంది. ఇందిరా గాంధీ మరణం, రాజీవ్‌ గాంధీ మరణంతో, అస్థిర ప్రభుత్వాల కారణంగా సొంతంగా అణుబాంబులు రూపొందించుకోవడంలో మన దేశం అప్పటికే వెనకబడింది. సాంకేతిక పెరగడంతో భారత్‌ అణు పరీక్ష కేంద్రాలపై అమెరికా అంతరిక్షంలో ఉపగ్రహాలతో పటిష్ఠ నిఘా వేసింది. థార్‌ ఎడారిలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకుంటోంది. ఆంక్షల పేరుతో దిల్లీ వర్గాలను బెదిరిస్తోంది. అమెరికా మిత్రదేశాలదీ అదే తీరు. భారత్‌కు అణు సాంకేతికత, రేడియో ధార్మిక పదార్థాలు అందకుండా ఎక్కడికక్కడ కట్టుబాట్లు. 1974లో స్మైలింగ్‌ బుద్ధ పేరుతో పరీక్షించిన అణు బాంబుల నిర్మాణ కార్యక్రమం ఆ తర్వాత ముందుకు పడలేదు. 1995లో పీవీ నరసింహా రావు రెండో దశ పర

గండికోట రహస్యమిదే!

చిత్రం
వారాంతంలో.. గండికోట రహస్యమిదే!     పెన్నా నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రావతి చిన్నగా ఉరకలేస్తుంటుంది. ఎప్పుడో గాని ఈ నదులు ఉధృతంగా ప్రవహించవు. అందుకే కాబోలు.. శతాబ్దాలు గడుస్తున్నా.. గండికోట చెక్కుచెదరక నిల్చుంది. కోటలోని రహస్యాలు పదిలంగా ఉన్నాయి. రెండో హంపీగా పేరున్న గండికోటలో పాగా వేసేందుకు ఎందరో రాజులు ఎన్నెన్నో యుద్ధాలు చేశారు. పెన్నాలో నెత్తురు పారించారు. ఇప్పుడదే కోటకు కులాసాగా చేరిపోవచ్చు. దిలాసాగా విహరించవచ్చు. పెన్నా లోయ సోయగాలు మనసారా ఆస్వాదించవచ్చు. అం దమైన లోయలు, శత్రుదుర్భేద్యమైన కోట, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసినా అబ్బురపరిచే దృశ్యాలు.. గండికోట రహస్యమిదే! కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున ఉంటుందీ కోట. పూర్వం ఈ ప్రాంతాన్ని గిరిదుర్గం అనేవారు. పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య భారీ గండి ఏర్పడింది. ఆ సమీపంలో కోటను నిర్మించడంతో దీనికి గండికోట అని పేరొచ్చింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న లోయ గుండా పెన్నా నది వయ్యారాలు ఒలకబోస్తూ ప్రవహిస్తుంటుంది. ఎందరో రాజులు.. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజు త్రైలోక్యమల్లకు