పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

సాగంతా సౌరవిద్యుత్తుతోనే!

చిత్రం
గ్రామాల్లో మైక్రోగ్రిడ్లకు అనుసంధానం  ఇసా-అమరావతి ఆధ్వర్యంలో ఏటా ప్రపంచ ఉత్తమ సౌర నగరం అవార్డు  విద్యుత్తు ఆవిష్కరణల వేదిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు  రూ.13,200 కోట్లతో సౌరపలకలు, బ్యాటరీతయారీపై సాఫ్ట్‌బ్యాంక్‌తో ఒప్పందం ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో వ్యవసాయానికి వినియోగించే 17లక్షల విద్యుత్తు  కనెక్షన్లకు సౌరపలకలు అమర్చి గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. రైతులు వాడుకోగా మిగిలిన విద్యుత్తును యూనిట్‌కు రూ.1.50 వంతున చెల్లిస్తాం. అన్నదాతలకు నెలకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఆదాయం లభించేలా చేస్తాం. ఇపుడున్న వాటి స్థానంలో ఇంధన పొదుపు పంపుసెట్లు అమరుస్తాం’  అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రామాల వారీగా మైక్రోగిడ్లు ఏర్పాటుచేసి రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడి ప్రజలే వినియోగించుకునే విధానం తెస్తామన్నారు. విజయవాడలో జరుగుతున్న ‘విద్యుత్తు ఆవిష్కరణల వేదిక 2019’ ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ప్రభుత్వానికి ఖర్చు లేకుండా రాష్ట్రమంతా ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చినట్లే ఈ బృహత్తర ప్రాజెక్టునూ అమలుచేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం, ఇపుడున్న ప్రభుత